Monday, December 22, 2008

ఓ నేస్తం...

ఈ కవిత నా ప్రాణ స్నేహితులకు అంకితం..

నేస్తం..!
ఉదయించే సూర్యుడివి నీవైతే ప్రజ్వలించే కాంతి నేను
కుసుమించే పుష్పానివి నీవైతే నీలో నిలిచిపోయిన మధుర మకరందం నేను
మధుర స్వరాలు ఆలపించే కోకిల నీవైతే స్వరాలనందుకొనే పాటను నేను...
కురిసే చిరు చినుకు నీవైతే అందుకునే పసిడి నేలను నేను
అస్తమించే రవి నీవైతే నిను సేదతీర్చ వచ్చిన జాబిలిని నేను
స్నేహం మరువలేనిది గనుకే వీడిపోని ప్రాణ స్నేహితులం మనము....

....@సుధి

No comments: